రెండేళ్లకే ‘పదోన్నతి’?

9 Oct, 2020 01:26 IST|Sakshi

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతి సర్వీసు కాలాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పదోన్నతి పొందాలంటే సదరు ఉద్యోగి కనీసం 3 ఏళ్లు ప్రస్తుత హోదాలో పనిచేసి ఉండాలనే నిబంధన ఉండేది. దీని ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకే పదోన్నతు లకు అవ కాశం ఉండేది. ఇప్పుడు ఆ సర్వీసు కాలాన్ని రెండేళ్లకు తగ్గించే ప్రతి పాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనికి వచ్చే ఉద్యోగుల్లో ఎంత మంది రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు, అందులో ఎంత మంది పదోన్న తులకు అర్హులవుతారో వివరాలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ వివరాలను పంపాలని ఇటీవల శాఖల హెచ్‌వోడీలకు లేఖ రాసింది. 

మరిన్ని వార్తలు