‘ప్యూర్‌ ఈవీ’ నుంచి మరో ఈ–బైక్‌

18 Nov, 2020 08:22 IST|Sakshi
ప్యూర్‌ ఈవీ తయారు చేసిన ద్విచక్రవాహనం

సంగారెడ్డి టౌన్ ‌: ఐఐటీ హైదరాబాద్‌ స్టార్టప్‌ సంస్థ ‘ప్యూర్‌ ఈవీ’మరో ఈ–బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. బ్యాటరీతో నడిచే సరికొత్త ద్విచక్ర వాహనాన్ని డిసెంబర్‌ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై– స్పీడ్‌ లాంగ్‌–రేంజ్‌ మోడల్‌తో మార్కెట్‌లోకి రానున్న ఈ వాహనానికి ‘ఈ–ట్రాన్స్‌ నియో’గా నామకరణం చేశారు. కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం పుంజుకోవడం దీని ప్రత్యేకత. ఈ బైక్‌కు బిగించిన 2,500 డబ్ల్యూహెచ్‌ పేటెంట్‌ బ్యాటరీ ‘ఎకో మోడ్‌’లో ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వేగంగా పికప్‌ అందుకునేలా ‘ఈ–ట్రాన్స్‌ నియో’ను రూపొంచినట్లు ‘ప్యూర్‌ ఈవీ’సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్‌ వడేరా తెలిపారు. యువతను ఆకట్టుకునే విధంగా బాడీ తయారు చేశామన్నారు.

మరిన్ని వార్తలు