ఖమ్మంలో వైద్య కళాశాల ఏర్పాటు

12 Aug, 2022 02:58 IST|Sakshi

మౌలిక వసతులు, నూతన భవనాలకు రూ.166 కోట్లు విడుదల 

సీఎంకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా­లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు అను­బంధంగా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభు­త్వం ఉత్తర్వులు జారీచేయడంపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలి పారు. ఖమ్మం వైద్య కళాశాల ఏర్పా­టు ఉత్తర్వు ప్రతిని గురు వారం సీఎం ప్రగతి­భవన్‌లో పువ్వాడకు అందజేశారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు.

మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణానికి రూ.166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వైద్య కళాశాలను ప్రారంభించనున్నారని, ఈ మేరకు వంద సీట్లను కేటాయించిందన్నారు. తరగ­తుల నిర్వహణ, ప్రొఫెసర్లు, నర్సింగ్‌ కళా శాలకు అనువుగా ఉన్న ప్రస్తుత కలెక్టరేట్‌ భవనాల సముదా యం, ఆర్‌అండ్‌బీ శాఖల స్థలాన్ని వైద్య కళాశాలకు అప్పగించనున్నట్టు మంత్రి అజయ్‌ కుమార్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు