పీఏ తల్లి పాడె మోసిన మంత్రి పువ్వాడ 

10 Feb, 2021 09:11 IST|Sakshi

తన వ్యక్తిగత సహాయకుడి తల్లి అనారోగ్యంతో మృతిచెందగా.. ఆమె పాడె మోసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ త‌న అనుబంధాన్ని చాటుకున్నారు. ఆయన పీఏ, ఖమ్మంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన చిరుమామిళ్ల రవికిరణ్‌ తల్లి దమయంతి (60) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం దమయంతి అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.   – ఖమ్మం, అర్బన్ 

చదవండి: టీకా వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

చదవండి: కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశాక విచారణ చేస్తారా? 

మరిన్ని వార్తలు