సాక్షి, వరంగల్: అడవుల్లో, చెట్లపొదల్లో ఉండే కొండ చిలువలు ఆహారం కోసం ఒకచోటునుంచి మరోచోటుకు వెళ్తుంటాయి. అలాంటి ఘటనే ఇది. బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేట గుట్టలోనుంచి రోడ్డు ఆవతలికి వెళ్లే క్రమంలో జాతీయ రహదారిపై రెండు కొండచిలువలు వచ్చాయి. ఒకదాని వెనకాల మరోకటి క్యూ లైన్ లాగా రోడ్డుపై నుంచి వెళ్తుండడంతో వాహనదారులు ఆపి ఆసక్తి చూస్తూ ఫొటోలు తీశారు.