వ్యవసాయ వర్సిటీ వీసీగా రఘునందన్‌రావు 

26 Jul, 2022 01:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ (వీసీ)గా వ్యవసాయ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రవీణ్‌రావు ఈనెల 24న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి వీసీగా రఘునందన్‌రావు బాధ్యతలు స్వీకరించారు.

పూర్తిస్థాయి వీసీ నియామకం జరిగే వరకు రఘునందన్‌రావు ఈ బాధ్యతల్లో ఉండనున్నారు. పూర్తిస్థాయి వీసీ పదవీ విరమణ చేసినపుడు వ్యవసాయ శాఖకు కమిషనర్‌గా ఉన్న వారే ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావు ఈ బాధ్యతలు చేపట్టారు.  

మరిన్ని వార్తలు