గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి

8 Sep, 2021 19:37 IST|Sakshi

గద్వాల జిల్లా మానవపాడులో రమణీయ దృశ్యాలు ఆవిష్కృతం

ఆసక్తిగా తిలకించిన స్థానికులు

సాక్షి, గద్వాల: ప్రకృతి అందాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎన్నో ఉన్నాయి. వర్షాకాలం వేళ మరింత రమణీయంగా పర్యాటక ప్రాంతాలు కనులవిందు చేస్తుంటాయి. వర్షాల జోరుకు బుధవారం కొంత తెరపడింది. అయితే వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా మారింది. ఈ సమయంలో ఇంద్రధనుస్సు విరిసింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో అద్బుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు అస్తమించే సూర్యుడిలా దర్శనమిచ్చింది. ఇంద్రధనస్సు కనువిందు చేయడంతో స్థానిక ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు.

మరిన్ని వార్తలు