రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ఫేస్‌బుక్‌ ఐడీ హ్యాక్‌

17 Feb, 2021 08:41 IST|Sakshi

సాక్షి, శంషాబాద్‌: రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌ పేరిట ఉన్న ప్రకాష్‌గౌడ్‌ యువసేన ఐడీని సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. దీని ద్వారా డబ్బులు అడుగుతున్నట్లుగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు సమాచారం అందడంతో మంగళవారం ఆయన సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఐడీతో ఎలాంటి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు స్వీకరించకూడదని ఆయన వివరించారు. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు ఆయన సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. ఈ విషయమైన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ హ్యాకింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
చదవండి: ‘రేవంత్‌ ఉన్నడా.. నాకు బాగా దగ్గరోడు ఆయన’
బ్లేడుతో తల్లి బెదిరింపు.. తానే కోసుకున్న బాలుడు​
​​​​​​

మరిన్ని వార్తలు