రాష్ట్రంలోకి రామరథయాత్ర  

26 Sep, 2020 08:23 IST|Sakshi

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఈవో

జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్‌): అయోధ్య రామమందిరంలో ఓంకార ధ్వనులను ప్రతి ధ్వనింపజేసే ఘంటానాదానికి ఐదో శక్తిపీఠం అమ్మవారు జోగుళాంబదేవి ఆశీస్సులు అందాయి. భక్తురాలు రాజ్యలక్ష్మి ఈ గంటను రామ రథయాత్ర ద్వారా అయోధ్యకు చేరుస్తున్నారు. రామేశ్వరం టు రామ జన్మభూమి పేరిట 613 కిలోల ఈ గంటను అయోధ్యకు చేర్చేందుకు సెప్టెంబర్‌ 17న రామరథ యాత్రను ప్రారంభించారు. శుక్రవారం ఈ యాత్ర తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయానికి చేరుకుంది. ఆలయ ఈఓ ప్రేమ్‌కుమార్‌ అర్చకులతో కలసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 21రోజుల పాటు 4,552 కిలోమీటర్లు, పది రాష్ట్రాల మీదుగా భక్తుల పూజలందుకుంటూ అయోధ్యకు ఈ గంటలను చేరుస్తామని రథసారథి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు