శివరాత్రి రోజున శ్వేత నాగు దర్శనం; జన్మ ధన్యం!

11 Mar, 2021 12:59 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని లక్సీట్టిపెట్ మునిసిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో మహా శివరాత్రి పర్వదినాన పసుపునుటి సంతోష్ ఇనే వ్యక్తి ఇంటి పరిధిలో అరుదైన పెద్ద శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. కాలనీ వాసులు పెద్దఎత్తున శ్వేత నాగు పాముకు పూజలు చేసి పాలు పోశారు. మహాశివరాత్రి రోజు ఈ శ్వేత దర్శనం ఇవ్వడంతో జన్మ ధన్యమైందని భక్తులు అన్నారు. ఈ శ్వేత నాగును దర్శించుకునేందుకు కాలనీ వాసులు తరలివచ్చారు. స్థానికులు స్నేక్ ‌క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో.. ‌శ్వేతనాగును పట్టుకుని అడవిలో వదిలేశారు.


చదవండి:
కడతేరిన ‘ఫేస్‌బుక్’‌ ప్రేమ 
రిటైర్డు డీజీపీ మెయిల్‌ నుంచి మెసేజ్‌ రావడంతో..

మరిన్ని వార్తలు