13న అసెంబ్లీ ఎదుట రెడ్డి సంఘాల నిరసన

9 Sep, 2022 01:30 IST|Sakshi

కాచిగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాక్షిక మేనిఫెస్టోలో పెట్టిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 13న రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి తెలిపారు. నాలుగేళ్ల క్రితం మాటిచ్చి మరచిపోయిన ముఖ్యమంత్రికి గుర్తు చేద్దామని, రెడ్డి కార్పొరేషన్‌ సాధించుకుందామని ఆయన పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు