గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రాపర్టీ ట్యాక్స్‌పై వడ్డీ భారం తగ్గింపు

28 Jul, 2020 19:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ప్రాపర్టీ టాక్స్‌పై వడ్డీ భారాన్ని తగ్గిస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకే ఈ నిర్ణయం వెలువడింది. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం కింద ప్రాపర్టీ టాక్స్‌పై కేవలం 10శాతం వడ్డీ కడితే సరిపోతుంది. ఈ అవకాశం కేవలం 45 రోజులు పాటు (ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 15) మాత్రమే కల్పించారు. భారీగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 5.64లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా.. ఇప్పటి వరకు రూ. 1477.86 బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు