టీచర్ల ఉద్యమానికి కాంగ్రెస్‌ మద్దతు

29 Jan, 2022 04:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ, ఉపాధ్యా య వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న 317 జీవో రద్దు కోసం ఉపాధ్యాయ సంఘా ల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఉద్య మానికి కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతి స్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే టీచర్ల ధర్నాల్లో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఉపాధ్యాయులకు సంఘీభావం తెలపాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.  


 

మరిన్ని వార్తలు