Medak Road Accident: విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ఇద్దరు మృతి

28 Jun, 2022 15:37 IST|Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొల్చారం మండలం రంగంపేటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు హాస్టల్‌ విద్యార్థులపై వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థి జశ్వంత్ మృతి సంఘటన ప్రాంతంలోనే మృతిచెందగా.. మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో విద్యార్థి రజనీకాంత్ ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలైన విద్యార్థి  చరణ్ మెదక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని వార్తలు