మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

12 Sep, 2022 07:40 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున మేడ్చల్‌లో ఓ బైక్‌ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి.. లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, మహిళ ఉన్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు