TSRTC: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. కిలోమీటర్‌కు ఎంతంటే..?!

7 Nov, 2021 13:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగునున్నాయి. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు ఆపై సర్వీసులకు 30పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్‌సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.

చదవండి: (ఆ కుటుంబపై పాము పగపట్టింది.. ఒకేసారి ముగ్గుర్ని..)

మరిన్ని వార్తలు