TS: మానవత్వం చాటుకున్న మంత్రి సబితా

3 Dec, 2021 15:15 IST|Sakshi

సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌ డెంటల్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని షిఫ్ట్ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన కాన్వాయ్ ఆపి ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

చదవండి: Fine For No Mask In Telangana: మాస్క్‌ ధరించకపోతే రూ. 1000 జరిమానా

తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రిని తరలించారు. వారికి వికారాబాద్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించి మానవత్వాన్ని చాటుకున్నారు.

చదవండి: ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణం

మరిన్ని వార్తలు