ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్‌ ఎంపిక

18 Aug, 2022 01:50 IST|Sakshi
అవార్డుకు ఎంపికైన ఫొటో 

భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్‌ నేషన్‌ వన్‌ ఫ్లాగ్‌’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్‌ కోల్లోజు శివకుమార్‌ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్‌ అవార్డు అందుకోనున్నారు.

మరిన్ని వార్తలు