చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం

13 Sep, 2021 02:41 IST|Sakshi

మంత్రి సత్యవతి రాథోడ్‌ 

ఇల్లెందు: హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన గిరిజన బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు వచ్చిన మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని తెలిపారు. అలాగే, చిన్నారి కుటుంబానికి ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా ప్రభుత్వ సాయం అందిస్తుందని చెప్పారు. ఆ కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

మరిన్ని వార్తలు