రేపు సింగరేణి ఎలక్ట్రీషియన్‌ రాత పరీక్ష 

25 Sep, 2021 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌లో ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌(పర్సనల్‌) ఎ.ఆనందరావు తెలి పారు. హాల్‌ టికెట్లను వెబ్‌సైట్లో ఉంచామని  పేర్కొన్నారు. కొత్తగూడెంలోని నాలుగు కేం ద్రాలు.. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్‌ కాలేజీ, సింగరేణి హైస్కూల్, అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పరీక్ష జరుగుతుంది. 

మరిన్ని వార్తలు