తెలంగాణలో ఈ ఏడాది స్కూళ్లు బంద్‌

24 Dec, 2020 10:23 IST|Sakshi

1-5 తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల వరకు నేరుగా ప్రమోట్‌ చేసే అవకాశం ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ మేరకు స్కూళ్ల బంద్‌ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల బంద్‌ నిర్ణయం ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కూడా వర్తించనుంది. 
 

మరిన్ని వార్తలు