తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం

27 Jun, 2021 09:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు తాత్కాలిక బ్రేక్ పడింది. స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 9, 10 తరగతులకు కూడా ఆన్‌లైన్‌లోనే బోధన నిర్వహించనుంది. 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. దీనికి సంబంధించి నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.

(చదవండి: కూకట్‌పల్లిలో విషాదం: ఆట మధ్యలో ఫోన్‌ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య)

మరిన్ని వార్తలు