‘కేసీఆర్‌ ఆదేశాలను సీఎస్‌ పట్టించుకోవడం లేదు’

26 Aug, 2021 18:37 IST|Sakshi

సచివాలయ ఉద్యోగుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్కే భవన్‌లో సీఎస్ చాంబర్‌ ముందు ఉద్యోగులు గురువారం ఆందోళన నిర్వహించారు. సచివాలయంలో తమకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కసారి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలను సీఎస్‌ పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సచివాలయ ఉద్యోగులు నినాదాలు చేశారు.

ఇవీ చదవండి:
గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ
సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి..

మరిన్ని వార్తలు