‘మండల’ అధికారుల సంఘం అధ్యక్షుడిగా శేషంజన్‌

9 Jan, 2023 02:11 IST|Sakshi
నూతన కార్యవర్గానికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎన్నికల అధికారి  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా శేషంజన్‌ స్వామి, ప్రధాన కార్యదర్శిగా అత్తర్‌ పర్వేజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో ఈ మేరకు ఎన్నుకున్నారు.

అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా రఘుపతిరెడ్డి, కోశాధికారిగా రవీందర్‌రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా డీపీవో సురేశ్‌ మోహన్, అసిస్టెంట్‌గా డీఎల్‌పీవో సాధన వ్యవహరించారు.

>
మరిన్ని వార్తలు