సాక్షి, హైదరాబాద్: జగ్నేకీ రాత్గా పిలిచే షబ్బే బరాత్ నేపథ్యంలో నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసేవేయనున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము వరకు గ్రీన్ ల్యాండ్స్, లంగర్హోస్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.