‘సిట్‌’ అంటే.. సిట్, స్టాండ్‌ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

22 Mar, 2023 07:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిట్‌ అంటే.. సిట్, స్టాండ్‌ మాత్రమేనని, గతంలో సిట్‌ విచారించిన కేసులు ఎటు పోయా యని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణకు వెళ్లిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

డ్రగ్స్, నయీం భూముల కేసులు, గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ కేసు, హౌసింగ్‌బోర్డు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ ఎటు పోయిందని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో సిట్‌ తాళాలు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టులో వాదనలు వినిపించిందని, టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని తాము కోర్టును కోరామని చెప్పారు.

పేపర్‌ లీకేజీ అంశంలో ప్రవీణ్, రాజశేఖర్‌లతో పరిమితం కాకుండా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీ, కస్టోడియన్‌ శంకరలక్షి్మని కూడా బాధ్యులుగా చేర్చాలని కోరారు. ఈ విషయాన్ని సమగ్రంగా దర్యాప్తు జరపాలని అడిగితే తనకు సిట్‌ నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: కొలువుల కలవరం

మరిన్ని వార్తలు