హైదరాబాద్‌: పలు ప్యాసింజర్‌, ఎంఎంటీఎస్‌ రైళ్లు తాత్కాలికంగా రద్దు.. లిస్ట్‌ ఇదే..

11 Jan, 2023 13:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. 

నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్‌ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్‌ రైళ్ల వివరాలకొస్తే.. 

లింగంపల్లి-హైదరాబాద్, 
హైదరాబాద్-లింగంపల్లి,
ఫలక్‌నుమా-లింగంపల్లి
లింగంపల్లి-ఫలక్‌నుమా
ఆర్సీ పురం-ఫలక్‌నుమా
ఫలక్‌నుమా-ఆర్సీ పురం
ఫలక్‌నుమా-హైదరాబాద్‌ల మధ్య ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెండురోజుల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని ట్విటర్‌ ద్వారా స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే.

మరిన్ని వార్తలు