14న దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా భేటీ 

7 Nov, 2021 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని  తిరుపతిలో ఈ నెల 14న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌ రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు