ప్రత్యేక కౌన్సెలింగ్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు

9 Nov, 2020 02:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సెంట్రల్‌ సీట్‌ అలొకేషన్‌ బోర్డు (సీఎస్‌ఏబీ) నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్‌ జారీ చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐ ప్రవేశాలకు జాయిం ట్‌ సీట్‌ అలకేషనల్‌ అథారిటీ (జోసా) గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్‌ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్‌ తరువాత ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు సీఎస్‌ఏబీ షెడ్యూల్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు