సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

22 Apr, 2022 08:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్‌–తిరుపతి(02764/02763) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 23, 30, మే 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 6.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు తిరుపతికి చేరుకుంటుంది.

తిరుగుప్రయాణంలో ఈ నెల 24, మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మచిలీపట్నం–సికింద్రాబాద్‌ (07185/07186) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 24, మే 1, 8, 15, 22, 29 జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగించనుంది.   

మరిన్ని వార్తలు