సీఎంఆర్‌ఎఫ్‌కు సన్‌ నెట్‌వర్క్‌ రూ.3 కోట్లు విరాళం

21 Aug, 2021 10:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం సహాయ నిధికి సన్‌ నెట్‌వర్క్‌ రూ.3 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. మంత్రి కేటీఆర్‌ను జెమినీ టీవీ బాధ్యులు పి.కిరణ్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కోవిడ్‌ సమ యంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ‘సన్‌’ ఉదారతను మంత్రి అభినందించారు.
 

మరిన్ని వార్తలు