TS: వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్‌

12 Sep, 2021 12:29 IST|Sakshi

హైకోర్టు తమ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరతాం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ వినాయకుడిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్‌ వేస్తామని తెలిపారు. కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నిమజ్జనం పూర్తయ్యాక హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేస్తామన్నారు. హైకోర్టు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు

ఇవీ చదవండి:
ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్‌ సక్సెస్‌ 
అనాథను ఆదరించింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది

మరిన్ని వార్తలు