శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్‌ విమానానికి తప్పిన ప్రమాదం

29 May, 2022 12:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైబిగ్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్‌ విమానం రన్‌వే పైకి వెళ్లగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తి రన్‌వేపై నిలిచిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు విమానం బయలుదేరకపోవడంతో అధికారులపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు ధర్నాకు దిగారు.  
చదవండి: భయ్యా.. ఇదేమయ్యా!  నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో

మరిన్ని వార్తలు