Telangana Beer Prices: ‘బీర్‌’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు?

18 May, 2022 02:06 IST|Sakshi

అన్ని బ్రాండ్లపై రూ.10–20 పెంచే ప్రతిపాదన... 

సాక్షి,హైదరాబాద్‌: ‘బీర్‌’ప్రియులకు చేదు వార్త. బీర్‌ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం. బీర్‌ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్‌ ధరల పెంపుపై ఎ క్సైజ్‌ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు.

ఈ కసరత్తు అనంతరం ఒక్కో బీర్‌ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్‌ బీర్‌ రూ.140 ఉండగా దాన్ని రూ.150, స్ట్రాంగ్‌ బీర్‌ రూ.150 ఉండగా, దాన్ని రూ.170 చేయనున్నట్లు సమాచారం. 
చదవండి: హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

మరిన్ని వార్తలు