కార్పొరేట్‌ సంస్థల బడ్జెట్‌ 

2 Feb, 2022 04:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ సంస్థల కోసం అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు కేటాయింపులు లేవని, కరోనాతో చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నా వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు. అలాగే రాజ్యాంగం మార్చాలని అనడానికి సీఎం కేసీఆర్‌కు బుద్ధి ఉండాలని, దీనిపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాటకానికి తెరలేపారని భట్టి విమర్శించారు.   

మరిన్ని వార్తలు