కేసీఆర్‌ వైఫల్యంతోనే పాలమూరుపై ఎన్జీటీ స్టే

30 Oct, 2021 01:59 IST|Sakshi

బీజేపీ నేత డీకే అరుణ  

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే విధించడానికి సీఎం కేసీఆర్‌ వైఫల్యమే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని విమర్శించారు. పాలమూరుపై ఆయనకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ పరిణామం చోటుచేసుకుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు