సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి విశ్వమంగళ దినమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లయినా, ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.