బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్‌

6 Mar, 2022 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌ చర్చించింది. మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ రెండున్నర లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశముంది. గత ఏడాది రూ.2 లక్షల 30వేల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
చదవండి: కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు