రాకేశ్‌ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌ గ్రేషియా

18 Jun, 2022 02:45 IST|Sakshi

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

సీఎం కేసీఆర్‌ ప్రకటన

కేంద్రం తప్పుడు విధానాల వల్లే రాకేష్‌ బలయ్యాడని మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: అగ్నిపథ్‌ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిరుద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తంచేశారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ బిడ్డ రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేశ్‌ బలయ్యాడని విచారం వ్యక్తంచేశారు.  

మరిన్ని వార్తలు