CM KCR Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. రేపు బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం

3 May, 2023 07:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అత్యాధునిక హంగులతో వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన రేపు(గురువారం) ప్రారంభించనున్నారు. 

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఇప్పటికే పార్టీ ఆఫీస్‌ కార్యాలయ ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభానికి ముందు శాస్త్రోక్తంగా యాగం, హోమం, ఇతర పూజ కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనం అవుతారని తెలుస్తోంది.

రేపు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని.. గురువారం ఆయన ఢిల్లీలో ఉంటారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం. ఈ మధ్యలో ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో, మరికొందరు జాతీయ నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: తడిసినా కొంటాం.. రైతన్నకు సీఎం కేసీఆర్‌ భరోసా

>
మరిన్ని వార్తలు