కోతులకు అరటి పండ్లు అందించిన సీఎం కేసీఆర్

13 Sep, 2020 17:59 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం లంచ్‌ ముగించుకొని సీఎం కేసీఆర్‌ తన వాహనంలో కొండ కిందికి వెళ్తున్న సమయంలో దారికి కోతులు అడ్డురావడంతో కారుదిగి వాటికి అరటిపండ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన యాదాద్రి టూరిజం హోటల్‌ వద్ద జరిగింది. (స్మార్ట్‌ సిటీ తెచ్చిన ఘనత వినోద్‌ కుమార్‌దే)

మరిన్ని వార్తలు