వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు

3 Jan, 2023 01:40 IST|Sakshi

వేంకటేశ్వర కాలనీ: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ సోమవారం శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, స్థానిక కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు