Telangana: ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

22 Jan, 2022 13:45 IST|Sakshi

టీ–శాట్‌ ద్వారా ఇంటర్‌ సిలబస్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులు కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇకపై ఈ తరహా మెకానిజం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తరచూ మూతపడుతున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. అంతిమంగా సిలబస్‌ పూర్తవ్వలేదని, ఫెయిల్‌ అయిన విద్యార్థులు పాస్‌ చేయాలంటూ పట్టుపడుతున్నారు.

ఈ సమస్య రాకుండా టీ–శాట్‌ ద్వారా పక్కా ప్రణాళిక ప్రకారం బోధన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు షెడ్యూల్డ్‌ కూడా ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు హాజరవ్వకున్నా విద్యార్థులు దీనిద్వారా సిలబస్‌ పూర్తి చేసుకునే వీలుందని భావిస్తున్నారు. (క్లిక్‌: కోవిడ్‌ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి)

  

మరిన్ని వార్తలు