ప్రధాని మోదీకి రేవంత్‌రెడ్డి లేఖ.. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని..

16 Jul, 2022 18:27 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఓ లేఖ రాశారు. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ విస్తరణ, రైతులు, మృతుల బంధువులకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని కోరారు.

అలాగే వీటితో పాటు రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం తక్షణ సహాయ ప్యాకేజీని రూ.2,000 కోట్లు విడుదల చేయాలని లేఖలో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు