డాక్టర్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌

27 Dec, 2022 01:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్ర­జా­రోగ్య సంచాలకుడి పరిధిలో ఎంబీబీఎస్‌ అర్హతతో చేప ట్టే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టు­ల నియామకా­లకు మంగళవారం నుంచి 3 రోజు లపాటు కౌన్సె­లింగ్‌ నిర్వహించనున్నారు. 27, 28 తేదీల్లో మల్టీజోన్‌–1కు చెందిన 452 మంది అభ్యర్థు­లకు, 29న మల్టీజోన్‌–2కు చెందిన 282 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ జరగనుంది.

అభ్య­ర్థులు హైదరాబాద్‌ వెంగళరావు­నగర్‌లోని ఇండియ న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామి­లీ కార్యాలయంలో హాజ­రు­కావా­లి. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోతే సు­మోటోగా పోస్టింగ్‌ ఆర్డర్లు జారీ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో పొందిన ర్యాంక్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. మెరిట్‌ ప్రకారం కౌ­న్సెలింగ్‌ ఉంటుంది కాబట్టి ఎవరు ముందు­గా వస్తే వారి ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్‌లు వస్తాయని, పైరవీలను నమ్ముకో­వద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.  

>
మరిన్ని వార్తలు