సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 6026 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 4,69,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 2928 మంది మృతి చెందారు. తెలంగాణలో గత 24 గంటల్లో 64,362 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,40,16,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
( చదవండి: గర్భిణులు కరోనా వ్యాక్సిన్ను ఎప్పుడు తీసుకోవాలి )