24 గంట‌ల్లో తెలంగాణ‌లో కొత్తగా 3308 కేసులు

22 May, 2021 20:06 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 3308 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 21 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4723 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,04,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 42,959 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3106 మంది మృతి చెందారు. అత్యధికంగా కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 513, మేడ్చల్‌లో 203, ఖమ్మంలో 228, రంగారెడ్డిలో 226 నమోదయ్యాయి.

చదవండి: తెలంగాణలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌

మరిన్ని వార్తలు