సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 42,526 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2242 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 19 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4693 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,09,663 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉన్నాయి.