24 గంట‌ల్లో తెలంగాణ‌లో కొత్తగా 3,614 కేసులు

27 May, 2021 20:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 90,226 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,614 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 18 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,961 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,26,043 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 38,267 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,48,30,083 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌ బాధితుల్లో 3207 మంది మృతి చెందారు.

చదవండి: రూ. 46 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలే..!

మరిన్ని వార్తలు