బలవర్థక ఆహారమే లక్ష్యం 

18 Mar, 2022 03:19 IST|Sakshi

సీఎంఆర్‌ బియ్యంలో ఫోర్టిఫైడ్‌ రైస్‌  

మిల్లుల్లో మిక్చర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోండి 

రైస్‌ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు 

1.89 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణే లక్ష్యం 

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్‌ రైస్‌పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్ధకమైన బియ్యం) అంశం తెరపైకి వచ్చింది. గతేడాది రబీకి సంబంధించి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వాల్సిన రైస్‌ మిల్లర్లు ఇకపై బలవర్థకమైన బియ్యాన్ని కలిపి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ రైస్‌ మిల్లులకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) నిర్ణయం మేరకే ఆదేశాలిచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.89లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌తో కూడిన బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు.  

క్వింటాల్‌కు ఒక కిలో.. 
గత రబీ సీజన్‌(2020–21)లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్‌ మిల్లులకు ఇచ్చిన విషయం విధితమే. ఈ బియ్యంలో బలవర్థకమైన బియ్యాన్ని మిలితం చేసి ఇవ్వాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది. ఒక్కో క్వింటాల్‌ బియ్యంలో కిలో బలవర్థక బియ్యాన్ని కలపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన బలవర్ధక బియ్యాన్ని సీఎంఆర్‌ బియ్యంలో మిళితం చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

ఇందుకోసం వెంటనే మిల్లులు ఈ మిక్చర్‌ ప్లాంట్లను అమర్చుకోవాలని ఆదేశించింది. బలవర్థక బియ్యంలో వివిధ రకాల విటమిన్‌లు ఉంటాయి. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఈ ఫోర్టిఫైడ్‌రైస్‌ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు